ఇండిగో విమానంలో భయానక వాతావరణం..! చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక!
Thu May 22, 2025 11:34 Business
ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమాన ప్రయాణికులకు బుధవారం భయానక అనుభవం ఎదురైంది. మార్గమధ్యంలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా విమానం గాలిలో భారీ కుదుపులకు లోనైంది. ఈ విమానంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల బృందం కూడా ఉండగా, వారిలో ఒకరైన సాగరిక ఘోష్ ఈ ఘటనను ‘మృత్యువు అంచుల వరకు వెళ్లిన అనుభవం’గా అభివర్ణించారు.
టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రెయిన్, నదీముల్ హక్, సాగరిక ఘోష్, మానస్ భునియా, మమతా ఠాకూర్లతో కూడిన ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈ విమానంలో ప్రయాణిస్తోంది. శ్రీనగర్ వెళ్తుండగా ఆకస్మికంగా వడగళ్ల వాన మొదలవ్వడంతో విమానం అదుపుతప్పినంత పనైంది. ఈ కుదుపుల తీవ్రతకు పైలట్ శ్రీనగర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ‘ఎమర్జెన్సీ’ పరిస్థితిని నివేదించాల్సి వచ్చింది.
ఈ భయానక క్షణాల గురించి సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. "ఇది దాదాపు చావును చూసినట్లే ఉంది. నా జీవితం ముగిసిపోయిందనే అనుకున్నాను. ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు, దేవుడిని ప్రార్థించారు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు" అని తెలిపారు. "అంతటి క్లిష్ట పరిస్థితిలోంచి మమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పైలట్కు హ్యాట్సాఫ్. విమానం ల్యాండ్ అయ్యాక చూస్తే దాని ముక్కు భాగం దెబ్బతిని ఉంది" అని వివరించారు. ల్యాండింగ్ అనంతరం తమ బృందం పైలట్కు కృతజ్ఞతలు తెలిపిందని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ విమానంలో మొత్తం 200 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సురక్షితంగా శ్రీనగర్లో దిగారు. విమానం కుదుపులకు లోనైనప్పటి దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ప్రయాణికులు భయంతో ప్రార్థనలు చేస్తుండటంతోపాటు విమానం అటూ ఇటూ ఊగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపించాయి.
జమ్మూకశ్మీర్లో మే 23 వరకు పర్యటించనున్న టీఎంసీ బృందం శ్రీనగర్తో పాటు పూంఛ్, రాజౌరీ ప్రాంతాల్లో కూడా పర్యటించనుంది. సరిహద్దు దాడుల వల్ల నష్టపోయిన ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు, తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల దుఃఖంలో పాలుపంచుకునేందుకే ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇండిగో ఏమందంటే?
ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ 2142 మార్గమధ్యంలో ఆకస్మిక వడగళ్ల వానలో చిక్కుకుంది. విమాన సిబ్బంది, క్యాబిన్ సిబ్బంది నిర్దేశిత నిబంధనలను అనుసరించి, విమానాన్ని శ్రీనగర్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. "విమానం దిగిన తర్వాత ప్రయాణికుల సంక్షేమం, సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ ఎయిర్పోర్ట్ సిబ్బంది వారిని పర్యవేక్షించారు. అవసరమైన తనిఖీలు, నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత విమానాన్ని తిరిగి సేవలకు విడుదల చేస్తాం" అని ఇండిగో సంస్థ వివరించింది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
హైదరాబాద్లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!
పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..
అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #IndiGoFlight #MidAirPanic #TMCMP #Sagarika #FlightScare #IndiGoIncident #AviationNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.